Friday, April 26, 2024

గంగ దైవ‌త్వాన్ని ప్రేరేసిస్తుంది – అమితాబ్ బ‌చ్చ‌న్

రిషికేష్, ఉత్త‌రాఖండ్ లో ప‌ర్య‌టించారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్. ఈ సందర్భంగా అమితా బచ్చన్ రిషికేష్ లో పరమార్థ్ గంగా హారతి, పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పరమార్థ్ నికేతన్ ప్రెసిడెంట్ స్వామి చిదానంద సరస్వతి వెంట హారతి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. (వీడియో) అమితాబ్ తన బ్లాగులోనూ ఇందుకు సంబంధించి ఫొటోను షేర్ చేశారు. ‘‘గంగ దైవత్వాన్ని ప్రేరేపిస్తుంది. మరెవ్వరూ చేయలేని విధంగా ఆత్మను ఆలింగనం చేసుకుంటుంది. మానవాళికి తెలియని రీతిలో భావోద్వేగాలు కలిగిస్తుంది’’అంటూ అమితాబ్ తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు. అమితా బచ్చన్ ఇటీవలి తన షూటింగ్ ఫొటోలను సైతం అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. గుడ్ బై చిత్రంలో రష్మిక మదన్నా, అమితాబ్ కనిపించన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement