Tuesday, May 7, 2024

అమానుషం: పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. కత్తితో పొడిచి పొడిచి చంపేశారు

ఒక వ్యక్తిని ముగ్గురు కలిసి చుట్టుముట్టు కత్తితో పొడిచి పొడిచి చంపుతున్న ఘటన కలకలం రేపింది. ఇది ఉత్తరప్రదేశ్​లోని మీరట్‌లోజరిగింది.  ఓ వ్యక్తిపై ముగ్గురు దాడికి పాల్పడిన షాకింగ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, వ్యక్తిగత వివాదం కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చిని పోలీసులు చెబుతున్నారు. కాగా, వీడియో క్లిప్‌లో రద్దీగా ఉండే రహదారి మధ్యలో ఒక వ్యక్తి నేలపై పడిపోగా, ముగ్గురు వ్యక్తులు పదేపదే కత్తితో పొడిచినట్టు కనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు బాధితుడిని గట్టిగా పట్టుకునన్నారు. అందులో ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి కత్తితో పొడుస్తున్నాడు.

కాగా, దాడి చేసిన ముగ్గురూ ఆ తర్వాత వేర్వేరు దిశల్లో పారిపోవడం కూడా ఆ వీడియోలో కనిపించింది. అయితే బాధితుడు రక్తపు మడుగులో లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎర్ర చొక్కా ధరించిన దాడి చేసిన వ్యక్తి చేతిలో కత్తితో వెనుకకు పరుగెత్తటం, అతని వెనుక భాగంలో పొడిచి నేలపైకి నెట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత అతడి ఛాతీపై మరో రెండు సార్లు పొడిచాడు.

ఈ ఇన్సిడెంట్​ జరుగుతున్నంత సేపూ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు వెళుతున్నాయి కానీ బాధితుడికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. హత్యను చూస్తూ అలా చాలామంది నిలబడి పోయారే కానీ, ఎవరూ జోక్యం చేసుకోలేదు..  బాధితుడు రక్తంతో తడిసిన బట్టలతో రోడ్డుపై పడి ఉండగా.. అతను కదలడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే వ్యక్తిగత గొడవల కారణంగా బాధితుడిని అతని మామ హత్య చేసి ఉంటాడని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement