Saturday, May 18, 2024

Breaking: ఇండియాదే విజ‌యం.. బ్యాటు మ‌డిచిన‌ స‌ఫారీలు, 131 ఆలౌట్​!

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు విజయం వైపు దూసుకెళ్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఓపెన‌ర్లు మంచి స్కోరు చేశారు. అయితే.. మిడిలార్డర్ అనుకున్నంత స్కోరు చేయలేకపోయిన బౌలర్లు సత్తా చాటుతున్నారు. దీంతో సఫారీలు బ్యాటు మ‌డిచి సంక‌లోపెట్టుకుని పోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది.

ఇప్పుడు 18వ ఓవర్లో వేయిన్ ప‌మేల్‌, కేశ‌వ్ మ‌హ‌రాజ్ బ్యాటింగ్ చేస్తున్నారు. మొత్తం ఏడు వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచుల్లో స‌ఫారీల జ‌ట్టు ఉంది. 18వ ఓవ‌ర్ వ‌ర‌కు 8 వికెట్ల న‌ష్టానికి సౌథాఫ్రికా 126 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఇంకా 12 బంతుల్లో 54 ప‌రుగులు చేయ‌డం అసాధ్య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే.. చివరి ఓవర్​ ముగియకుండా సఫారీలు ఆలౌట్​ అయ్యారు. దీంతో ఇండియా 48 పరుగుల భారీ విజయంతో మూడో టీ20ని సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement