Saturday, April 27, 2024

India Corona: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో 223 మంది మృతి

భారత్‌లో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. అయితే, నిన్న తగ్గిన కేసులు నేడు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో7,554  కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 223 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 92,472గా ఉంది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 16,864 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,23,24,550కి పెరిగింది.  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,77,79,92,977 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement