Sunday, April 28, 2024

India Corona: దేశంలో 24 గంటల్లో 434 మంది మృతి.. కొత్త కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కేంద్రం వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచన 24 గంటల్లో కొత్త‌గా 7,495 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. కరోనాతో 434 మంది బాధితులు మరణించారు. అదే సమయంలో క‌రోనా నుంచి మ‌రో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 78,291 క‌రోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,42,08,926కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,78,759కి చేరుకుంది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.40 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,39,69,76,774 కోట్ల‌కు పైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement