Monday, May 13, 2024

India Corona: భారత్ లో కరోనా ఖతం.. 24 గంటల్లో 4575 కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కేసులు పూర్తిగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కేవలం 4,575 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 145 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,15,355 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7416 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక దేశంలో ప్రస్తుతం 46962 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.92 శాతంగా ఉంది.  దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,75,883 కు చేరింది. ఇందులో మొత్తం 4,224,13,566 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,779,33,99,555 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement