Monday, April 29, 2024

కరీంనగర్ – వరంగల్ 4 లేన్ విస్తరణ పనులు షురూ..

కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 563) 4 లేన్ పనులకు మోక్షం లభించింది. ఈ పనుల కోసం రూ.2,146 కోట్ల 86 లక్షలను కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు ట్వీట్ చేశారు. నిధులు మంజూరు కావడంతో శరవేగంగా విస్తరణ పనులు ప్రారంభమం కానున్నాయి. రోడ్డు విస్తరణ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయించాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గత కొంత కాలంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కలిసి పనులను వేగవంతం చేయాలని కోరుతూ వస్తున్నారు.

బండి సంజయ్ చొరవతో ఈ రోడ్డు విస్తరణ పనులను ఈరోజు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీలో ఆమోదించారు. దీంతో గతంలో బిడ్స్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ రహదారి విస్తరణ పనులు తొందరగా పూర్తయితే కరీంనగర్ -వరంగల్ మీదుగా ప్రయాణించే ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగడమే కాకుండా ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని అవకాశాలు మెరుగవుతాయి. కరీంనగర్ – వరంగల్ 4 లేన్ విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయడంపట్ల బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement