Sunday, May 19, 2024

India Corona: దేశంలో ఒక్కరోజే 2.86 లక్షల కేసులు.. 573 మరణాలు

భారత్ లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం..  దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 2,86,384 కేసులు న‌మోదు అయ్యాయి. 573 మంది క‌రోనాతో మృతి చెందారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,06,357 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 19.59శాతంగా ఉంది.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,03,71,500 కు చేరింది. ఇందులో 3,76,77,328 కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,91,700 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 163,84,39,207 మందికి వ్యాక్సినేష‌న్ అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement