Saturday, September 21, 2024

తెలుగుగంగ కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి

సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రము మండల పరిధిలోని శ్రీనివాసపురం సమీపంలో ఉన్న తెలుగుగంగ కాలువ వద్ద చోటుచేసుకుంది. నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు గ్రామానికి చెందిన పెరివి జగన్(21), కొండారి చైతన్య(22), విష్ణులు సరదాగా ఈత కొట్టేందుకు మోటర్ సైకిల్ పై తెలుగుగంగ కాలువ వద్దకు చేరుకున్నారు. ఈత కొడుతున్న సమయంలో చైతన్య, జగన్ లు అదుపుతప్పి పడిపోవడంతో కేకలు వేశారు. పక్కనే ఉన్న విష్ణు వారిని కాపాడేందుకు ప్రయత్నించగా విష్ణు కూడా జారీ పడిపోవడంతో  పెద్ద ఎత్తున కేకలు‌ వేయగా సమీపంలో‌ ఉన్న ఇద్దురు సంఘటనా‌‌ స్ధలానికి చేరుకుని విష్ణుని కాపాడారు.

అప్పటికే చైతన్య, జగన్ లు మృతిచెందారు. పోలీసులకు సమాచారం అందించడంతో నాయుడుపేట ఎస్సై కృష్ణారెడ్డి సంఘటనా స్ధలానికి‌ చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమ్మిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చైతన్య కుమార్ బెంగుళూరులో సాప్ట్ వేర్ గా పనిచేస్తున్నాడు. కోవిడ్ కారణంగా ఇంటివద్దే విధులు నిర్వహిస్తున్నాడు. పుదూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో‌ విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement