Wednesday, May 8, 2024

India Corona: దేశంలో కొత్తగా 10,853 కేసులు.. 526 మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా 11 వేల దిగువకు కేసులు నమోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 10,853 కేసులు న‌మోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, మరణాలు సంఖ్య మాత్రం పెరిగింది. నిన్న ఒక్కరోజే 526 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తం గా 12,432 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,44,845 కు చేరింది. గడిచిన 260 రోజుల్లో ఇంత తక్కువ యాక్టివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటి సారి.

దేశవ్యా ప్తంగా ఇప్పటి వరకు 3,37,49, 900 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 4, 60, 791 మంది వైరస్ కు బలైయ్యారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,08,21,66,365 మంది టీకాలు తీసుకున్నట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Telangana: TRS ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

Advertisement

తాజా వార్తలు

Advertisement