Monday, April 29, 2024

India Corona: 24 గంటల్లో 1054 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1054 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 29 మంది కరోనాతో మరణించారు. అదే సమయంలో 1258 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,35,271కు చేరింది. ఇందులో 4,25,02,454 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 5,21,685 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో11,132 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా పాజిటివిటి రేటు 98 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,885,70,71,655 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement