Friday, May 17, 2024

ఢిల్లీకి పెద్దపల్లి గులాబీ దళం: ప్రతి గింజ కొనే వరకు పోరాటం

తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి గింజను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో తలపెట్టిన దీక్షలో పాల్గొనేందుకు పెద్దపల్లి గులాబీ దళం బయలుదేరింది. ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం దేశమంతా ధాన్యం సేకరణ కోసం ఒకే విధానం అమలు చేయాలన్నారు. పంజాబ్ తరహా తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను కొనే వరకు కర్షక లోకం తరఫున తెరాస పోరాటం చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement