Sunday, May 5, 2024

India Corona: దేశంలో తగ్గని కరోనా విలయం.. ఒక్కరోజే 1059 మంది మృతి

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే, కరోనా మరణాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,27,952 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,20,80,664 కు చేరింది. 1059 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 5,01,114 కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,30,814 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రోజు వారీ పాజివిటి కేసులు 7.9% శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 13,31,648 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,68,98,17,199 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement