Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 1.34 లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజు స్వలంగా పెరిగాయి. మరో వైపు కరోనా మరణాలు 3వేల దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,34,154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 2,11,499 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారని చెప్పింది. మరో 2,887 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,84,41,986కు చేరింది. మొత్తం 2,63,90,584 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,37,989 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 17,13,413 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 22,10,43,693 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement