Saturday, April 27, 2024

దేశంలో కరోనా ప్రళయం.. వరుసగా రెండోరోజు 4వేలకు పైగా మరణాలు

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వ‌రుస‌గా రెండో రోజూ నాలుగు వేల‌కు పైగా మంది కరోనాతో మ‌ర‌ణించారు. దేశంలో తొలిసారిగా శ‌నివారం 4వేల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. మరోవైపు రోజువారీ కేసులు వ‌రుస‌గా నాలుగో రోజూ నాలుగు ల‌క్ష‌లు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.23 కోట్ల‌కు చేరువ‌లో నిలిచాయి.

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,03,626 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా 4,091 మంది వైర‌స్ వ‌ల్ల క‌న్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,22,95,911ల‌కు చేర‌గా, మృతులు 2,42,398కు పెరిగారు. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 53,605 కేసులు ఉండ‌గా, క‌ర్ణాట‌క‌లో 47,563, కేర‌ళ‌లో 41,971 చొప్పున ఉన్నాయి. శనివారం ఒక్కరోజే మహారాష్ట్రలో 864 మంది కరోనాతో ప్రాణాలు విడవగా, క‌ర్ణాట‌క‌లో 482 మంది, ఢిల్లీలో 332 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement