Sunday, May 5, 2024

దేశంలో మరోసారి 40 వేలు దాటిన కరోనా కేసులు

ఇండియా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 44,658 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,26,03,188 కి చేర‌గా ఇందులో 3,18,21,428 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,44,899 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 496 మంది మృతి చెందారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,36,861 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 24 గంట‌ల్లో 79,48,439 మందికి టీకాలు వేశారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 61,22,08,542 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశంలో థర్డ్ వేవ్ వచ్చేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: అభిమాన నటున్ని కలిసిిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా..

Advertisement

తాజా వార్తలు

Advertisement