Thursday, May 2, 2024

దేశంలో కొత్త‌గా 60,471 మందికి క‌రోనా

దేశంలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య 61 వేల దిగువ‌కు చేరింది. నిన్న 60,471 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. నిన్న 1,17,525 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,95,70,881కు చేరింది. మరో  2,726 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,77,031కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,82,80,472 మంది కోలుకున్నారు.  9,13,378  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,90,44,072 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,13,75,984  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న17,51,358 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement