Tuesday, May 14, 2024

ఆదర్శనీయంగా సీఎం శివరాజ్ సింగ్..కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పొయిన చిన్నారులతో దీపావళి సంబరాలు

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఆదర్శనీయమైన పని చేశారు. కరోనా   మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల మధ్య తన భార్యతో కలసి ఘనంగా తన నివాసంలోనే దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం డ్యాన్స్ చేసి చిన్నారులను అలరించారు. నా పిల్లల్లారా.. మీరు ఈ విధంగా నవ్వుతూ ఉండడానికి, మీరు సంతోషంగా ఉండేందుకు, మీ ముఖం ఎప్పుడూ ఆనందంతో వెలిగిపోయేందుకు నాకు వీలైన ప్రతిదీ చేస్తాను. మన బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని చేస్తుందని ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ హిందీలో ట్వీట్ చేశారు. తన నివాసంలో దీపావళి సంబరాలకు వచ్చిన చిన్నారులకు ఆయుష్ కిట్ ను బహుమతిగా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement