తాను లేని సమయంలో తన ప్లాట్ లో నగదుని ఉంచారని టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాంలో పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఆగస్ట్ 3 వరకూ ఈడీ కస్టడీకి న్యాయస్ధానం తరలించింది. జులై 22న అర్పితా నివాసంపై ఈడీ దాడుల్లో రూ 21.90 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ 56 లక్షల విదేశీ నగదు, రూ 76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆపై అర్పిత మరో ఫ్లాట్లో జరిపిన దాడుల్లో రూ 28.90 కోట్ల నగదు పట్టుబడింది. ఐదు కిలోల బంగారం, పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో పట్టుబడిన నగదు, బంగారం తనది కాదని, తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని పార్ధ ఛటర్జీ ఆరోపిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement