Sunday, May 5, 2024

రేపటి నుంచి పూర్తిస్థాయిలో మెట్రో సేవలు

తెలంగాణలో ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో మెట్రో రైలు సర్వీసుల సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్‌, చివరి స్టేషన్‌ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది. మారిన సమయాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం నిబంధనలు పాటించాలని మెట్రో అధికారులు కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement