Thursday, April 25, 2024

నాన్ స్టాప్ బాదుడు..మళ్లీ పెరిగిన చమురు ధరలు..

దేశంలో ఇంధన ధరల అడ్డు అదుపు లేకుండాపోతోంది భగ్గుమంటున్నాయి. గత నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఒక రోజు విరామం తర్వాత ఆదివారం ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 30, డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.22, డీజిల్‌ ధర రూ.87.97కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.36, డీజిల్‌ రూ.95.44కు పెరిగింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏడు, ఎనిమిది రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. దేశంలో అత్యధిక ధర రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.108.37కు చేరగా.. డీజిల్‌ ధర రూ.101.12కు చేరింది. గత నెల మేలో ఇంధన ధరలను 16 సార్లు సవరించగా.. జూన్‌లో ఇప్పటి వరకు 12 సార్లు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement