Monday, April 29, 2024

హైదరాబాద్‌లో ఘోరం.. కరోనా వచ్చిందన్న భయంతో ఉరేసుకుని చనిపోయాడు..

ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తి ఆదివారం సాయంత్రం నేరేడ్‌మెట్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భయంతో అతను తన ఇంట్లోనే సీలింగ్‌ ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. జనవరి 14న నిర్వహించిన మెడికల్ రిపోర్టులో అతనికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

అప్పటి నుంచి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఆదివారం భార్య, ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. వారు తిరిగి వచ్చే సమయానికి అతను ఉరివేసుకున్నాడు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement