Friday, March 29, 2024

ఏపీ డిప్యూటీ సీఎంకి క‌రోనా

సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఈ మ‌ధ్య కాలంలో అధికంగా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ కి కూడా క‌రోనా పాజిటీవ్ గా తేలింది. దాంతో ఆయ‌న ఐసొలేష‌న్ లోకి వెళ్లిపోయారు. ఈ మేర‌కు త‌న‌ని క‌ల‌వ‌డానికి ఎవ‌రూ రావొద్ద‌ని తెలిపారు. రీసెంట్ గా త‌న‌ని క‌లిసిన వారంతా క‌రోనా టెస్ట్ ల‌ని చేయించుకోవాల‌ని సూచించారు. కాగా రీసెంట్ గాటీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. డాక్టర్ సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement