Saturday, May 4, 2024

Crime: భార్యను హత్య చేసిన భర్త

కట్టుకున్న భార్యనే హత్య చేశాడో భర్త. ఈ ఘటన మహబూబాద్ జిల్లా గూడూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఏపూరు గ్రామ శివారు కోడిపుంజుల తండాలో బానోతు బిక్కి(40) ను భర్త కోటియా హత్య చేశాడు. శనివారం రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని సంఘటన జరిగిన పూర్వాపరాలను తెలుసుకుంటున్నారు. హత్య చేసిన భర్త పరారీలో ఉండటంతో గూడూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కొన్ని గంటల్లోనే భర్తను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement