Thursday, April 25, 2024

Flash: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురికి తీవ్ర గాయాలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ లో సుమారుగా 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది. చింతలపూడి మండలం బాలావారిగూడెం నుంచి పుట్రేపు మారెమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement