Tuesday, May 7, 2024

భారీ అగ్నిప్రమాదం.. 50ఇళ్లు దగ్థం.. తప్పిన ప్రాణ నష్టం

ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 50కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.ఈ ప్రమాదం పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల రైల్వే సెటిల్‌మెంట్‌లో (మురికివాడలో) చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు.

నార్త్ 24 పరగణాల హబ్రా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 17 సమీపంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. ఆ ప్రాంతంలో మంటలు వేగంగా వ్యాపించేలోపు పెద్ద శబ్ధం వినిపించిందని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు తూర్పు రైల్వే పరిధిలోని బొంగావ్, సీల్దా మధ్య రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement