Thursday, May 2, 2024

పరిశీలన చేయకుండా లక్షల కార్డులు ఎలా రద్దు చేస్తారు?.. తెలంగాణపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎల్. నాగేశ్వరావు, జస్టిస్‌ బి.ఆర్. గవాయ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. 19 లక్షలకు పైగా రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్ర స్థాయిలో సరైన పరిశీలన జరపకుండా కంప్యూటర్‌లో పొందుపరిచిన వివరాల ఆధారంగానే లక్షల రేషన్ కార్డులు ఎలా తొలగిస్తారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

2016లో మార్గదర్శకాలతో కేంద్రం జారీ చేసిన నోటిషికేషన్‌ ఆధారంగా మళ్లీ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేషన్ కార్డుల రద్దుకు ఎటువంటి ప్రమాణాలు పాటించారో అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement