Friday, April 26, 2024

స‌ముద్ర మ‌ట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ‘ఫుట్ బాల్’ మైదానం

ల‌డ‌ఖ్ లోని స్పిటుక్ వ‌ద్ద అత్యాధునిక స‌దుపాయాలు ఉన్న ఫుట్ బాల్ మైదానాన్ని నిర్మించారు. కాగా ఇది భార‌త్ లోనే అత్యంత ఎత్త‌యిన సాక‌ర్ మైదానం. ఈ స్టేడియం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈ వెంట్ల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డేలా తీర్చిదిద్దుతున్నారు. హిమాలయ పర్వత సానువుల్లో సాధారణ జనవజీవనం ఎంత కష్ట సాధ్యమో తెలియంది కాదు. గడ్డకట్టించే శీతల వాతావరణం జీవుల మనుగడకు సవాలుగా నిలుస్తుంది. అలాంటి చోట ఫుట్ బాల్ మైదానం ఏర్పాటు చేయడం అంటే నిజంగా అచ్చెరువొందించే విషయం. ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్టేడియం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. 30 వేల మంది ప్రేక్షకుల కూర్చునేలా గ్యాలరీలు నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం అంచనా వ్యయం రూ.10.68 కోట్లు. అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం ఫిఫా కూడా లడఖ్ ఫుట్ బాల్ మైదానానికి పచ్చజెండా ఊపింది. ఖేలో ఇండియా కార్యాచరణలో భాగంగా మైదానం ఉపరితలాన్ని ఆస్ట్రోటర్ఫ్ తో ఏర్పాటు చేశారు. అంతేకాదు, స్టేడియాన్ని ట్రాక్ ఈవెంట్ల కోసం ఉపయోగించుకునేందుకు వీలుగా 8 లేన్లతో సింథటిక్ ట్రాక్ లను కూడా పొందుపరిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement