Sunday, May 19, 2024

క్రికెట్ ఆడుతుండ‌గా ఆగిన గుండె..

ఓ యువ‌కుడు క్రికెట్ ఆడుతుండ‌గా గుండెపోటు రావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది. జిల్లాలోని చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన శనిగరం ఆంజనేయులు హుస్నాబాద్‌లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. అతని వయసు 37 ఏళ్లు. బౌలింగ్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. గుండె పట్టుకొని పడిపోయాడు.

అంతా అక్కడకు వచ్చి చూస్తే మనిషిలో చలనం లేదు. గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని గ్రహించిన స్నేహితులు సీపీఆర్ చేశారు. సీపీఆర్ చేస్తూనే దగ్గర్‌లోనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్టు చెప్పారు. అంతే ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు సరదాగా తమతోనే ఉన్న మిత్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందడాన్ని ఆంజనేయులు స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement