హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్య రంగంలో సాధించిన ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని భవిష్య త్తులో మరింతగా బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగా భివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించిందని సీఎం కేసీఆర్ అన్నారు. పచ్చని పంటలు చక్కని వాతావరణంతో ప్రకృతి రమణీ యతతో అలరారుతున్న తెలంగాణలో రాష్ట్ర ప్రజ లంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ”ప్రపంచ ఆరోగ్య దినోత్సవం” సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన పురోగతిని, అమలు చేస్తున్న పలు పథకాలను, తద్వారా ప్రజలకు అందుతున్న వైద్యం, మెరుగుపడుతున్న ప్రజల ఆరోగ్యం గురించి ఆయన పలు అంశాలను ప్రజలకు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కరువైన ఉమ్మడి పాలన నాటి గడ్డు పరిస్థితుల నుంచి నేడు తెలంగాణలో జిల్లాకో వైద్య విద్య, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీలను స్థాపించుకునే దశకు చేరుకున్నా మన్నారు. మెడికల్ కాలేజీల సీట్లు భారీగా పెంపు, ప్రభుత్వ దవాఖానలు, మెడికల్, నర్సింగ్ కాలే జీల్లో అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియా మకం చేపట్టడం ద్వారా వైద్యం సామాన్యుడికి చేరు వయిందన్నారు. సాధారణ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్ల సంఖ్య పెంపు, ప్రతి ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరికరాలు, మందులు, లేబొరే టరీల ఏర్పాటుతో ప్రజావైద్యంలో గుణాత్మక మార్పు చోటు చేసుకున్నదన్నారు.
అన్ని ఆరోగ్య సూచీల్లో జాతీయ సగటును మించి…
కేంద్రం ప్రకటించిన అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉండడం స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతను చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహంచిన హల్త్ ఫిట్నెస్ కాంపె యిన్లో 3 కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్రం 3 కేటగిరీల్లోనూ అవార్డులు సాధించడంతో పాటు, నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీల్లో 3వ స్థానాన్ని సాధించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అదే విధంగా కేంద్ర ఆర్థిక సర్వే 2022-2023 ప్రకారం దక్షిణ భారతదేశంలో ప్రజావైద్యంపై చేస్తున్న ఖర్చులో ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలం గాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలవడంతో పాటు, వైద్యం కోసం చేసే ఖర్చులో ప్రజలపై తక్కువ భారం పడుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలవడం, ప్రసూతి మరణాల రేటు తగ్గింపులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలవడం వంటి అంశాలు ప్రజారోగ్యంపై ప్రభుత్వానికున్న నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగించి దేశంలోనే గొప్ప వైద్యం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అన్నారు. ఇప్పటికే దేశ విదేశాలనుంచి ఆరోగ్య పరీక్షలు, ప్రత్యేక వైద్యం కోసం హద్రాబాద్కు తరలివస్తున్న నేపథ్యంలో తెలంగాణ మెడికల్ హబ్గా ఘనత సాధించిందని, ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని భవిష్య త్తులో మరింతగా బలోపేతం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ముఖ్య పట్టణాల్లో ప్రభుత్వ కార్పొరేట్ వైద్యం…
హద్రాబాద్ సహా వరంగల్ లాంటి ముఖ్యపట్ట ణాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్ళ(టిమ్స్) నిర్మాణంతో ప్రభుత్వ వైద్యసేవల్లో కార్పోరేట్ వైద్యం అందబోతున్నదన్నారు. హదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్ను అదనంగా 2500 పడకలతో విస్తరిం చడంతో పాటు, వరంగల్లో అన్ని వైద్య సదుపా యాలు ఒకేచోట లభ్యమయ్యే విధంగా ‘మెడికల్ హబ్’గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలు, వైద్య సదుపాయాల విస్తరణ, నిరంతర పర్యవేక్షణతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్య లక్ష్మీ, అమ్మఒడి, ఆరోగ్య మహళ (ప్రత్యేక మహళా క్లినిక్లు) వంటి పథకాలు తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక భాగస్వామ్యం వహస్తున్నాయని ఆయన తెలిపారు.
ఈ పథకాలు శ్రీరామ రక్ష..
బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్, ఆరోగ్య శ్రీ, ఎంప్లాయిస్ అండ్ జర్నలిస్ట్హల్త్ స్కీం, ఉచిత డయాలసిస్ కార్యక్రమం, 108 అత్యవసర ఆరోగ్య రవాణా సేవలు, పాలియేటివ్ కేర్, కంటి వెలుగు పథకం కింద మొదటి దశలో 1 కోటి మందికి పరీక్షలు, 40 లక్షల మందికి కంటి అద్దాలు, రెండవ దశలో 1 కోటికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు, 29 లక్షల మందికి ఉచితంగా అద్దాల పంపిణీ చేస్తూ పేదల, మహళల, బడుగు బలహన వర్గాలతో సహా ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.