Saturday, May 4, 2024

ఏపీలో షూటింగ్స్‌ చేస్తే నిర్మాతలకు రాయితీలు.. నంది అవార్డ్స్ పై చర్చిస్తాం.. పోసాని

నంది అవార్డులు పంచుకునే విషయంలో చాలా మంది దర్శక..నిర్మాతలు నష్టపోయారని..నటుడు పోసాని తెలిపారు. నందుల విషయంలో అన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.ఇక్కడ కమ్మ..కాపు డామినేషన్ ఏమీ లేదు..కేవలం డబ్బు మాత్రమే డామినేషన్ చేస్తుంది.నందులు పంచుకొనే విషయంలో చాలా మంది దర్శక నిర్మాతలు నష్టపోయారన్నారు. నందులు విషయంలో అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేశారు పోసాని కృష్ణ మురళి.టెంపర్ సినిమాకు త‌నకి నంది అవార్డు వచ్చింది..కానీ నేను వద్దన్నానన్నారు పోసాని కృష్ణ‌ముర‌ళీ.ఏపీలో షూటింగ్స్‌ చేస్తే..నిర్మాతలకు రాయితీలు ఇస్తామని పోసాని కృష్ణ మురళి ప్రకటన చేశారు. చలన చిత్ర అభివృద్ధి కోసం త్వరలో సీఎం జగన్‌ తో చర్చలు జరుపబోతున్నాం.. నంది అవార్డ్స్ కోసం కూడా మాట్లాడడం జరుగుతుందని వివరించారు. ఆంధ్రలో సినిమా షూటింగ్స్ చేస్తే నిర్మాతల కు భారం కాకుండా అతి తక్కువగా ఉండేలా చూస్తామన్నారు. దేశంలో ఎక్కడ కెని విధంగా ఎఫ్ డి సి కి వచ్చి సినిమా తీస్తాను అంటే అన్ని విధాలుగా వాళ్ళకీ సహకరిస్తామని.. నంది అవార్డులు విషయంలో నేను చిన్నప్పటి నుంచి వింటూనే వున్నానని వివరించారు. టెంపర్ లో నాకు నంది వచ్చింది తప్పదు అని నాకు ఇచ్చారు..కానీ దానిని తిరస్కరించానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement