Sunday, April 28, 2024

హెల్త్ బాగోలేదు-విచార‌ణ‌కు హాజ‌రుకాలేను- ఈడీకి సోనియాగాంధీ లేఖ‌

అనారోగ్యం కార‌ణంగా రెండురోజులు విచార‌ణ‌కు హాజ‌రుకాలేన‌ని ఈడీకి లేఖ రాశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. ఈ రెండు రోజులు విచారణ వాయిదా వేయాలని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ఇంటి వద్దే రెస్ట్ తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించినట్టు ట్వీట్ చేశారు. సోనియా గాంధీ జూన్ 1వ తేదీన కరోనా బారిన పడ్డారు.

అనంతరం ఆమె ఐసొలేషన్‌లోకి వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కరోనా సమస్యలతో సోనియా జూన్ 12న ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్‌లో చేరారు. ఆమె ఆరోగ్యం సుస్థిరంగా ఉందని ఇటీవలే ఓ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు.నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియాను, రాహుల్ గాంధీని తమ ముందు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement