Friday, March 29, 2024

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు తగ్గి 51,822 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్లు తగ్గి 15,413 వద్ద ముగిసింది. బ్యాంకు నిఫ్టీ 346 పాయింట్లు తగ్గింది. ఫలితంగా రెండో రోజు రిలీఫ్‌ ర్యాలీకి బ్రేక్‌పడింది. హిందాల్కో, యూపీఎల్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, విప్రో, రిలయన్స్‌, అదానీ, టైటన్‌, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు బీపీసీఎల్‌, హీరో మోటో కార్ప్‌, టీసీఎస్‌, పవర్‌ గ్రిడ్‌, మారుతి సుజుకి స్వల్పంగా లాభపడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement