Thursday, March 28, 2024

29నిమిషాల పాటు వృశ్చికాస‌నం వేసిన య‌శ్ మ‌న్సూక్ భాయ్ – గిన్నిస్ వ‌రల్డ్ రికార్డ్

29నిమిషాల పాటు ఓ యోగా టీచ‌ర్ వృశ్చికాస‌నం వేసి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. దుబాయ్ లో ఉన్న భార‌తీయ యోగా టీచ‌ర్ య‌శ్ మ‌న్సూక్‌భాయ్ మొరాదియా వేసిన ఆ ఆస‌నం వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తేలు(వృశ్చికాస‌నం) ఆకారంలో 21 ఏళ్ల మ‌న్సూక్ వేసిన యోగా అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తోంది. గ‌తంలో ఈ ఆస‌నాన్ని 4 నిమిషాల 47 సెకన్ల పాటు వేశాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ యోగా డే సంద‌ర్భంగా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్టు చేసింది. వృశ్చికాస‌నం అడ్వాన్స్ డ్ యోగా క్యాట‌గిరీలోకి వ‌స్తుంది. 2001లో పుట్టిన మ‌న్సూక్ 8 ఏళ్ల వ‌య‌సులో యోగా జ‌ర్నీ స్టార్ట్ చేశాడు. 2010 నుంచి అత‌ను ప‌వ‌ర్ యోగా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement