Thursday, May 9, 2024

Breaking: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముగిసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై బేటీ..

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా మూడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని నాలుగో సంవ‌త్స‌రంలోకి అడుగిడిన‌ట్టు తెలిపారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌. ఇవ్వాల (సోమ‌వారం) కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ మూడేళ్ల‌లో గ‌వ‌ర్న‌ర్‌గా త‌న అనుభ‌వాల‌పై రాసిన పుస్త‌కాన్ని అమిత్‌షాకి అంద‌జేశారు.

ఇక‌.. యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్ తమిళసై. రాజ్ భవన్ కు వచ్చి బిల్లుపై చర్చించాల‌ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు.కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డు (సీఆర్‌బీ) ద్వారా నియామకంపై అభిప్రాయం చెప్పాల‌ని యూజీసీకి కూడా గవర్నర్ త‌మిళిసై లేఖ రాశారు. ఇక‌.. యూనివర్సిటీలలో ఖాళీల భర్తీపై మూడేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్న‌ట్టు తెలిపారు గ‌వ‌ర్న‌ర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement