Wednesday, May 8, 2024

తగ్గేదే లే.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. రూ.53 వేలకు చేరువైన పసిడి

తబంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి. బంగారం ధరలు నాన్ స్టాప్ గా పెగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ.48,400కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి రూ.52,800కు ఎగిసింది. ఇక, బంగారంతో పాటు వెండి కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.900 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.73,400కి చేరింది. కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement