హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రిజం పబ్లో ఘర్షణ తలెత్తింది. పబ్కు వచ్చిన ఓ వ్యక్తిని అక్కడి బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో నందకిషోర్ అనే వ్యక్తి ప్రశ్నించడంతో బౌన్సర్లు దాడికి దిగారు. అంతేకాకుండా ప్రిజం పబ్ యాజమాన్యం కూడా అతనిపై అటాక్ చేసి గాయపరిచినట్టు తెలుస్తోంది. ఆదివారం కావడం, పబ్లో రద్దీ ఎక్కువ ఉండడంతో అక్కడ ఈ ఘర్షణ తలెత్తినట్టు తెలుస్తోంది.
ప్రిజం పబ్లో ప్రతి శని, ఆదివారాల్లో స్పెషల్ ప్రోగ్సామ్స్ ఏర్పాటు చేస్తుండడంతో పెద్ద ఎత్తున ఔత్సాహికులు, యువతీ, యువకులు అక్కడికి తరలివస్తుంటారు. అయితే ఈ ఘటనతో అక్కడ కాస్త గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ దాడి విషయమై బాధితుడు నందకిషోర్ పోలీసులకు కంప్లెయింట్ కూడా చేసినట్టు సమాచారం.