Thursday, March 28, 2024

ధోనీ ఫార్మ్ హౌస్‌లో క‌డ‌క్‌నాథ్‌.. క్రికెట్‌తో పాటు అగ్రిక‌ల్చ‌ర్‌ అంటే కూడా ఇష్ట‌మేన‌ట‌

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాక ధోనీ కేవలం ఐపీఎల్ లోనే ఆడుతున్నాడు. సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే క్రికెట్ ఆడే ధోనీ మిగతా సమయం అంతా వ్యవసాయానికి, ఇతర వ్యాపార కార్యకలాపాల కోసం కేటాయిస్తాడు. ఇటీవల కడక్ నాథ్ కోళ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ధోనీ.. మధ్యప్రదేశ్ లోని జబువాలో ఓ కోఆపరేటివ్ సొసైటీ నుంచి కొత్తగా 2 వేల కోడిపిల్లలకు ఆర్డర్ చేశారు. పేరుకు తగ్గట్టుగానే ఈకలు, మాంసం, గుడ్లతో సహా మొత్తం నల్లగా ఉండే ఈ కోళ్లు అనేకమంది ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఆక‌ర్షిస్తున్నాయి.

కడక్ నాథ్ కోడి మాంసంలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ విశ‌యాన్ని ఆక్క‌డి జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. ఓ వెహికిల్ లో రెండు వేల కోడిపిల్లలను రాంచీలోని ధోనీ వ్యవసాయ క్షేత్రానికి తరలించినట్టు తెలిపారు. ఎవరైనా ఈ కోడిపిల్లల కోసం ఆర్డర్ చేయవచ్చని, ధోనీ వంటి వ్యక్తి పోషక విలువలు పుష్కలంగా ఉండే కడక్ నాథ్ కోళ్లపై ఆసక్తి చూపించడం హర్షణీయం అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మార్కెట్లో లభించే మామూలు కోడి మాంసంతో పోలిస్తే కడక్ నాథ్ కోడిమాంసం ధర ఎక్కువేనని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement