Monday, May 6, 2024

బీభ‌త్సం సృష్టించిన ‘గంజాయి స్మ‌గ్ల‌ర్స్’

గంజాయి ముఠా బీభ‌త్సాన్ని సృష్టించింది. పోలీసుల నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ఆటోని ఢీకొట్టింది గంజాయి ముఠా కారు. దాంతో పోలీసులు కూడా ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా గంజాయి ముఠా కారును చేజ్ చేయ‌డంలో ఇద్ద‌రు స్మ‌గ‌ర్లు కారుని వ‌దిలేసి ప‌క్క‌నే ఉన్న చెరువులోకి దూకారు. కాగా మ‌రో నిందితుడు ప‌రార‌య్యాడు. ఈ సంఘ‌ట‌న విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఈ గంజాయి ముఠా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. ఓ కారులో గంజాయి తరలిస్తున్న విషయాన్ని స్థానిక ట్రాఫిక్ ఎస్‌ఐ గుర్తించారు. దీంతో ఎస్సై ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనిని గుర్తించిన వాహనంలోని గంజాయి ముఠా.. కారును మరింత వేగంగా పోనిచ్చారు. ఆ తర్వాత పరారైన మరో స్మగ్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement