Wednesday, May 8, 2024

కల్లు కాంపౌండ్ నుంచి లాక్కెళ్లి.. హిమాయత్‌సాగర్‌ దగ్గర గ్యాంగ్‌ రేప్‌..

  • సీసీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

రాజేంద్రనగర్‌ (ప్రభ న్యూస్‌) : రాజేంద్రనగర్‌ పోలీసులు గ్యాంగ్‌ రేప్‌ కమ్‌ ఎక్స్‌టార్షన్‌ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. రాజేంద్రన గర్‌ ఏ సి పి గంగాధర్‌, సీఐ కనకయ్య ను తెలిపిన వివరాల ప్రకారం… కుకట్‌ పల్లి వివేక నగర్‌ కు చెందిన నర్సింగ్‌ రావు యాదవ్‌, జగద్గిరిగుట్ట కు చెందిన నగేష్‌, బాలానగర్‌ పటేల్‌ నగర్‌ కు చెందిన బాకారం ప్రసాద్‌ ఈనెల ఈ నెల 13వ తేదీన కల్లు తాగడానికి రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని హైదర్‌ గూడ కు వచ్చారు. కల్లు కాంపౌండ్‌లో మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నారు. దీంతో మహిళ నగేష్‌ ను కల్లు కాంపౌండ్‌ లోకి వెళ్లి కల్లు తీసుకురావాల్సిందిగా కోరింది. తర్వాత బిర్యానీ ప్యాకెట్‌ తీసుకురావా లని కోరింది. అంతలో నరేష్‌ మిత్రులు నర్సింగరావు ప్రసాద్‌ అక్కడికి చేరుకున్నారు. బిర్యానీ ప్యాకెట్‌ వచ్చిన తర్వాత అదను చూసి ఆటోలో హిమాయత్‌ సాగర్‌ చెరువు సమీపంలో ని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె శరీరంపై ఉన్న నగలు సెల్‌ ఫోన్‌ తీసుకొని పారిపోయారు. మత్తు నుండి తెరుకున్న మహిళ అప్రమత్తమై రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో జరిగిన విషయంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజ్‌ ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement