Thursday, April 25, 2024

పండగ వేళ విషాదం.. ప్రమాదంలో నలుగురు మృతి

 
దసరా పండ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముదిగొండలో దేవీ నవరాత్రుల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాపురం సమీపంలోని అయ్యగారిపల్లి ఇసుకల వాగు వద్ద దుర్గా దేవి నిమజ్జనానికి వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళసహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను ఏలగొండ స్వామి, ఉపేందర్‌, నాగరాజు, ఉమగా గుర్తించారు. మృతులంతా కమలాపురం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అస‌మ్మ‌తి లీడ‌ర్ల‌కు షాకిచ్చిన సోనియా.. ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ఎవ‌రంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement