Sunday, April 28, 2024

ఇంటి తాళాలు ప‌గ‌ల‌గొట్టి.. ఉన్న‌దంతా ఊడ్చేశారు

  • అదునుచూసి.. రెచ్చిపోయిన దొంగలు

అబ్దుల్లాపుర్‌మెట్‌, (ప్రభ న్యూస్‌) : దసరా పండగకు సొంత ఊర్లకు నగరవాసులు వెళ్లడంతో అదును చూసి దొంగలు రెచ్చిపోయిన సంఘటన అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జ‌రిగింది. బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం ఇనాంగూడ గ్రామ పంచాయతీ పరిధి యశోద నగర్‌ కాలనీల్లో నివాసం ఉంటున్న గంగాధరి వెంకటరామయ్య, అదే ఇంట్లో కింది పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న ఉడుతల లింగుస్వామి దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లారు. యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, లింగారాజుపల్లి గ్రామనికి గంగాధరి వెంకట రామయ్య, అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం బిసి కాలనీలో అద్దెకు ఉంటున్న తన అత్త వారింటికి ఉడుతలు లింగుస్వామి వెళ్లారు. శనివారం లింగుస్వామి తన బట్టలు మార్చుకునేందుకు ఉదయం వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల బీరువా తెరిచి ఉంది అందులోని బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. పై పోర్షన్‌లో కుడా ఇదేవిధంగా ఉండటంతో స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించగా, క్లూస్‌ టీ ఆధారాలు సేకరించిన అనంతరం బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు- ఇన్‌స్పెక్టర్‌ వాసం స్వామి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement