Friday, April 26, 2024

అంత్య‌క్రియ‌ల్లో అప‌శృతి .. రోడ్డు ప్ర‌మాదంలో 17మంది మృతి ..

అంత్యక్రియ‌లు చేసేందుకు వెళ్ళుతుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 17మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న ప‌శ్చిమ‌బెంగాల్ న‌దియా జిల్లాలో చోటు చేసుకుంది. ఉత్త‌ర 24ప‌ర‌గ‌ణాల జిల్లా బాగ్డా నుంచి 20 మందికి పైగా వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలతో నవద్వీప్ శ్మశాన వాటికకి వెళ్ళుతుండ‌గా చోటే చేసుకుంది. హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రక్కును మెటాడోర్ అత్యంత బలంగా ఢీకొంది. ఈ ఘటనలో పలువురు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అతివేగంతోపాటు దట్టంగా కురుస్తున్న మంచే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement