Sunday, April 28, 2024

Breaking: ఈతకెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి

ఈతకెళ్లి ఐదుగురు చిన్నారులు మృతిచెందిన విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బొటాడ్ జిల్లాలోని కృష్ణానగర్ లో ఈతకు వెళ్తున్నామని చెప్పి వెళ్లిన ఐదుగురు చిన్నారులు మృతిచెందిన తీవ్ర విషాద ఘటన జరిగింది. చిన్నారులకు వేసవి సెలవులు ఉండడంతో.. ఈరోజు ఉదయం ఈతకు వెళ్తున్నామని వెళ్లారు. ఇంతలోగా ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement