Sunday, May 5, 2024

ఢిల్లీలో అగ్నిప్ర‌మాదం.. మంట‌లార్పుతోన్న ఫైర్ సిబ్బంది

ఓ రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్ లోని రెండ‌వ అంత‌స్తులో మంట‌లు చెల‌రేగాయి. అవిపై అంత‌స్తు వ‌ర‌కు వ్యాపించ‌న‌ట్లు స‌మాచారం.భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అప్రమత్తమైన సొసైటీ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు స్థానిక పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈ సంఘ‌ట‌న దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలో చోటు చేసుకుంది. మిగ‌తా విష‌యాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement