Sunday, May 5, 2024

Breaking: ఘోర రోడ్డుప్రమాదం.. 10మంది మృతి, 28మందికి తీవ్రగాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందగా, మరో 28మందికి తీవ్రగాయాలైన ఘటన చోటుచేసుకుంది. భారీ కంటైనర్ వాహనం పలు వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ధూలే జిల్లా సిర్పూర్ లో జరిగింది. భారీ కంటైనర్ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో 10మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 28మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement