Thursday, May 2, 2024

రైతుల ఇబ్బందుల‌ను ప‌రిశీలిస్తాం..జిల్లాల్లో బండి సంజ‌య్ ప‌ర్య‌ట‌న‌..

రైతులు ఎదుర్కొటోన్న ఇబ్బందుల‌ను ప‌రిశీలించేందుకు న‌వంబ‌ర్ 15,16న జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు బిజెపి పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు,ఎంపీ బండి సంజ‌య్ వెల్ల‌డించారు. వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుస‌రిస్తోంద‌ని .. రైతుల మధ్యనే కేసీఆర్‌ ప్రభుత్వ తీరును ఎండ గడతామని హెచ్చరించారు.. రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న బండి సంజయ్ …. అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం) ను సందర్శించనున్నారు . మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు. రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేస్తారు. ఎల్లుండి తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు. మార్కెట్ లో ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించనున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ ని రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement