Sunday, April 28, 2024

ఉప ఎన్నిక‌ల్లో టిడిపి, జ‌న‌సేన విజ‌య‌కేత‌నం

కోడూరు మండల పరిధిలోని విశ్వనాథ పల్లి గ్రామపంచాయతీ ఒకటో వార్డుకు హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికల్లో కొండవీటి విజయలక్ష్మి విజయ కేతనం ఎగురవేశారు. వైసిపి బలపరిచిన అభ్యర్థి తోట సుమలత పై 10 ఓట్ల తేడాతో విజయలక్ష్మి గెలుపొందారు. గత మార్చిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో గెలుపొందగా, ఆమె మరణించగా, ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు .ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నాగ రేవతి ధ్రువీకరణ పత్రాన్ని కొండవీటి విజయలక్ష్మి కు అందజేశారు. విజయలక్ష్మి గెలుపొందడంతో విశ్వనాధపల్లి లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement