Sunday, May 19, 2024

మార్కెట్లోకి ఫాంటా కొత్త బ్రాండ్.. అంబాసిడర్​గా సమంతా

హైదరాబాద్ : కోకా-కోలా ఇండియా ప్రవేశపెట్టిన  కొత్త బ్రాండ్​ ఏంటో తెలుసా? ఈ వేసవిని చల్లగా ఆస్వాదించడానికి ఫాంటా రూపంలో కొత్త కొత్త ప్రొడక్టులను తీసుకొస్తోంది ఈ కంపెనీ. అందులో భాగంగా యాపిల్​ డిలైట్​ ఫ్రూట్​ జ్యూస్​ పేరిట కొత్త వేరియంట్​తో ముందుకొచ్చింది. దీనికిప్పుడు సమంతా బ్రాండ్​ అంబాసిడర్​గా ప్రచారం నిర్వహిస్తోంది. మధురమైన పళ్ల రుచి గల ఈ వేరియంటుతో విస్తరిస్తూ ఫాంటా యొక్క కొత్త రుచి అయిన యాపిల్ డిలైట్‌ ఆవిష్కరణను ప్రకటించింది. ఈ వేసవిలో ఇండియాలోని వినియోగదారులు తమ మనస్సు, శరీరం.. స్ఫూర్తిని తాజాగా ఉంచుకోవడానికి నిజమైన యాపిల్ పళ్ల రసంతో మెరిసే పానీయాన్ని ఆస్వాదించగలుగుతారు. సమంతా రూత్ ప్రభు ఫాంటా యాపిల్ డిలైట్ ఆస్వాదిస్తున్నట్లుగా ఓ ప్రకటనలో చూడవచ్చు.  

ఈ వేసవి తొలి రోజుల్లోనే ఇండియా లోని మార్కెట్ల వ్యాప్తంగా షెల్ఫులపై ఈ కొత్త వేరియంట్ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా సగం మిలియన్ కంటే ఎక్కువ ఔట్‌లెట్లలో చిల్లరగా విక్రయించేందుకు ఫాంటా ప్లాన్​ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల యాపిల్ వేరియంట్లలో ఫాంటా లభిస్తుంది. అని ఫాంటా ప్రతినిధులు తెలిపారు. ఆరంజ్ విభాగములో ఫాంటా మార్కెట్ వాటా అగ్రగామిగా ఉందని, కాగా, ఈ వేరియంటుతో మొత్తం పళ్ల -రుచి విభాగములో తనకు తానుగా వృద్ధి కావాలని బ్రాండు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement