Monday, May 6, 2024

ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి

ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుండి 42 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం లేకుండా సత్వరమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులలో రెవెన్యూ శాఖ 36, జిల్లా మైనార్టీ అభివృద్ధి శాఖ 2, భువనగిరి మున్సిపాలిటీ 1, డ్రగ్ ఇన్స్పెక్టర్ 1, ధరణి 1, డి.ఎం.సి.ఎస్. 1 చొప్పున 42 ఫిర్యాదులు అధినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement